ఆంధ్రప్రదేశ్,విశాఖపట్నం, జనవరి 29 -- Vatti Vasanta Kumar passed away:ఏపీకి చెందిన మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత వట్టి వసంత కుమార్ మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖపట్నంలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

వట్టి వసంతకుమార్‌ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లాలోని పూళ్ల గ్రామం. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన వసంత కుమార్... 2004, 2009 ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్‌రెడ్డి కేబినెట్‌లలో మంత్రిగా కూడా పని చేశారు. గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖల బాధ్యతలను నిర్వర్తించారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బలమైన వాణిని వినిపించారు. నాడు రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చలో... కీలక ప్రసంగం చేశారు. ఇక 2014 ఎన్నికల...