భారతదేశం, మార్చి 16 -- బజాజ్ ఆటో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ మోడల్గా కొనసాగుతున్న చేతక్ ఈ-స్కూటర్ కన్నా తక్కువ ధర ఉంటుందని సమాచారం. కొత్త బజాజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్ట్ మ్యూల్ ఇప్పటికే పబ్లిక్ రోడ్లపై చక్కర్లు కొట్టింది. ఈ నేపథ్యంలో ఈ మోడల్పై ఇప్పటివరకు వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
భారతదేశంలోని దాదాపు అన్ని ప్రధాన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారులు గత కొంతకాలంగా సరసమైన ప్రయాణికుల విభాగంలో తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీతో పాటు మరికొన్ని ఇప్పటికే ఈ వ్యూహాన్ని అనుసరించాయి. బజాజ్ ఆటో ఒక ప్రధాన ద్విచక్ర వాహన బ్రాండ్. పెరుగుతున్న కమ్యూటర్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పేస్లో మార్కెట్ షేరును సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ వ్యూహంలో భాగంగా ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.