భారతదేశం, మార్చి 27 -- Durga Temple Lands: దుర్గమ్మకే శఠగోపం పేరిట హెచ్‌టి తెలుగు కథనం దేవాదాయ శాఖలో కలకలం రేపింది. వందల కోట్ల ఖరీదు చేసే విజయవాడ దుర్గగుడి భూముల్ని యాభై ఏళ్లకు లీజు పొడిగించాలనే ప్రతిపాదనలు వెలుగులోకి రావడంతో దేవాదాయ శాఖ చర్యలు చేపట్టింది. విజయవాడ పటమట సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో సర్వే నంబర్‌ 17లొ ఉన్న 5 ఎకరాల 98 సెంట్ల భూముల ప్రస్తుత స్థితిపై సమగ్ర నివేదికను సమర్పించాలని దేవాదాయ శాఖ కమిషనర్‌ను ఆ శాఖ కార్యదర్శి ఆదేశించారు.

విజయవాడ నగరం మధ్యలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి ఉన్న భూముల్ని పలు సంస్థలకు లీజుకు ఇచ్చారు. ఈ క్రమంలో సిద్ధార్థ అకాడమీకి ఇచ్చిన 5.98 ఎకరాల భూమి లీజు పొడిగింపుపై ఆ శాఖ కమిషనర్‌ ఫిబ్రవరి 5వ తేదీన దేవాదాయ శాఖలో ప్రతిపాదించారు. దీనిపై అభ్యంతరాలు లేవనెత్తుతూ దేవాదాయశాఖ ఫిబ్రవరి 17 కమిషనర్‌కు మెమో పం...