భారతదేశం, ఏప్రిల్ 7 -- Durga Temple Lands: విజయవాడలో దుర్గ గుడి భూముల లీజు వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతంలో ఉన్న దాదాపు ఆరు ఎకరాల భూమి లీజు గడువు ముగియడంతో దానిని మరోమారు పొడిగించాలని లీజుదారుల నుంచి దేవాదాయ శాఖకు ప్రతిపాదనలు అందాయి. అందులో విద్యా సంస్థను నిర్వహిస్తుండటంతో మరో 50ఏళ్లకు పొడిగించాలని లీజుదారులు అభ్యర్థించారు.

యాభై ఏళ్లుగా నామమాత్రపు ధరతో ఉన్న దుర్గగుడి భూముల లీజును మరోసారి పొడిగించే ప్రతిపాదనకు దేవాదాయ శాఖ అభ్యంతం తెలిపింది. యాభై ఏళ్ల తర్వాత ఏమి జరుగుతుందో తెలియనందున ఆలయ భూముల్ని సమగ్రంగా సర్వే చేసి వాటిని శాశ్వతంగగా డిజిటల్‌ రూపంలో భద్రపరిచిన తర్వాత లీజు ప్రక్రియపై ముందుకు వెళ్లాలని ఆ శాఖ కార్యదర్శి కమిషనర్‌ను ఆదేశించారు.

ఈ క్రమంలో దుర్గామల్లేశ్వర దేవస్థానం నుంచి పటమట సబ్‌ రిజిస్ట్ర...