భారతదేశం, జనవరి 26 -- మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ యువతిపై ఆమె భర్త సోదరుడు, ఇతరులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 31 గంటల పాటు ఆమె నరకం చూసింది.

18ఏళ్ల యువతికి కొన్ని నెలల క్రితం వివాహం జరిగింది. కానీ అప్పటికి ఆమె ఒక మైనర్​. ఈ నేపథ్యంలోనే ఆమె తల్లిదండ్రులు యువతి భర్తపై ముంబై అంథేరీ పోలీస్​ స్టేషన్​లో కేసు పెట్టారు. అతడిని అరెస్ట్​ చేసిన పోలీసులు ముంబై జైలులో పెట్టారు. కాగా, భర్తకు బెయిల్​ కోసం ఆ యువతి బయట చాలా కష్టాలు పడింది. ఈ నేపథ్యంలోనే.. భర్తకు అన్న అయిన ఓ వ్యక్తి.. ఆ యువతిని సంప్రదించాడు. తమ్ముడుకి బెయిల్​ ఇప్పిస్తానని, తనను కలవాలని యువతికి చెప్పాడు. ఆ మాటలు నమ్మిన ఆమె.. బుధవారం ఉదయం నాసిక్​కి వెళ్లి అతడిని కలిసింది.

బెయిల్​కి గ్యాంటర్​ని పరిచయం చేస్తానని చెప్పి యువతికి ఆ వ్యక్తి పంచవటి ప్రాంతానికి తీసుకెళ్లాడ...