భారతదేశం, సెప్టెంబర్ 11 -- అమెరికాలో రాజకీయ హింస ఎంతగా పెరిగిపోతుందో మరోసారి రుజువైంది! అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అత్యంత సన్నిహితుడైన కన్జర్వేటివ్ కార్యకర్త ఛార్లీ కిర్క్.. యూటాలో జరిగిన ఒక కాలేజీ కార్యక్రమంలో కాల్పులకు బలైపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.

ఛార్లీ కిర్క్ మరణ వార్తను ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టర్నింగ్ పాయింట్ యూఎస్ఏ యువజన సంస్థ సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన 31 ఏళ్ల కిర్క్‌ను "గొప్ప వ్యక్తి, ఒక లెజెండ్" అంటూ కొనియాడారు. "అమెరికా యువత హృదయాన్ని ఛార్లీకి మించిన రీతిలో ఎవరూ అర్థం చేసుకోలేరు," అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో రాశారు.

యూటాలోని ఓరెమ్ మేయర్ డేవిడ్ యంగ్ ప్రకారం, అనుమానిత నిందితుడిని ఇంకా అరెస్ట్ చేయలేదు. కిర్క్ ప్రసంగిస్తున్న యూనివర్సిటీలో ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్...