భారతదేశం, ఫిబ్రవరి 1 -- భారీ పన్నులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు "బడ్జెట్​ 2025"లో భారీ శుభవార్తను ఇచ్చారు కేంద్రం ఆర్థిక నిర్మలా సీతారామన్​. మధ్యతరగతి ప్రజలకు మరింత ఆర్థిక బలాన్ని ఇచ్చేందుకు రూ. 12లక్షల జీతం వరకు ఆదాయపు పన్నును మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న శ్లాబు రేట్లను మారుస్తున్నట్టు వెల్లడించారు.

"దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి బలాన్ని అందిస్తుంది. వారి కృషికి గుర్తింపుగా ఎప్పటికప్పుడు పన్ను భారం తగ్గిస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదని బడ్జెట్​ 2025లో ప్రకటించడం సంతోషంగా ఉంది," అని నిర్మలా సీతారామన్​ వెల్లడించారు.

అంతేకాదు.. రూ. 75వేల స్టాండర్డ్​ డిడక్షన్​ ఉన్న వేతన జీవులకు రూ. 12.75 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని నిర్మల సీతారామన్​ తన బడ్జెట్​ 2025 ...