భారతదేశం, ఏప్రిల్ 6 -- పుష్ప 2: ది రూల్ సినిమా భారీ సక్సెస్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టుపై ఐకాన్ స్టార్ అర్జున్ ఫోకస్ చేశారు. తమిళ డైరెక్టర్ అట్లీతో తదుపరి మూవీ (AA22) చేయనున్నారు. గతంలోనే ఈ కాంబో సెట్ కాగా పట్టాలెక్కలేదు. చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే, ఇటీవలే మళ్లీ అల్లు అర్జున్, అట్లీ చిత్రం మళ్లీ ఓకే అయింది. ఈ సినిమా గురించి అనౌన్స్‌మెంట్ రెడీ అయింది. ఐకాన్ స్టార్ పుట్టిన రోజున వచ్చేయనుంది. ఆ వివరాలు ఇవే..

అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8వ తేదీన ఏఏ22 ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేయనుంది. ఇందుకోసం మూవీ టీమ్ ఓ స్పెషల్ వీడియోను కూడా రెడీ చేసిందని తెలుస్తోంది. అంటే మరో రెండు రోజుల్లోనే అల్లు అర్జున్ - అట్లీ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చేయనుంది.

ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో ఎలా ఉంటుందోననే ఎగ్జైట్‍మెంట్ అభిమానుల్లో విపరీతం...