భారతదేశం, ఫిబ్రవరి 2 -- నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 944 పాయింట్లు (1.17%) లాభపడి 81,666.46 వద్ద స్థిరపడగా.. నిఫ్టీ 50 సూచీ 263 పాయింట్లు (1.06%) పెరిగి 25,088.40 వద్ద ముగిసింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా లాభాల్లోనే ముగిశాయి. బిఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.450.6 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు చేరింది.

నేటి మార్కెట్ విశేషాలు: ఈ 10 పాయింట్లు గమనించండి

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O)పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ టాక్స్ (STT) పెంపు వంటి అంశాలను పక్కన పెట్టి, ప్రభుత్వం వృద్ధిపై చూపుతున్న శ్రద్ధను ఇన్వెస్టర్లు సానుకూలంగా తీసుకున్నారు. "బడ్జెట్‌లో ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో పాటు వృద్ధికి పెద్దపీట వేయడం ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పెంచింది" అని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్...