భారతదేశం, మార్చి 15 -- దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ స్కోడా నుంచి ఒక ఫ్లాగ్​షిప్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ రాబోతోంది. 2022 విజన్​ 7ఎస్​ కాన్సెప్ట్​ ఆధారంగా తయారవుతున్న ఈ ఈవీని సంస్థ తాజాగా టీజ్​ చేసింది. ఇది బ్రాండ్​కి చెందిన ఆల్​ న్యూ 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ. అధికారికంగా ధ్రువీకరణ అవ్వనప్పటికీ, ఈ ఈవీ పేరు 'స్పేస్​' అని తెలుస్తోంది. ఈ మోడల్​.. కియా ఈవీ9, హ్యుందాయ్​ ఐయానిక్​ 9 వంటి ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలకు గట్టిపోటీని ఇస్తుందని మార్కెట్​ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్కోడా నుంచి రాబోయే 7 సీటర్​ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

రాబోయే స్కోడా ఎలక్ట్రిక్ ఎస్​యూవీ.. బ్రాండ్​ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన ప్రాడెక్ట్​ అవ్వొచ్చు! అంతేకాదు, ఈ ఈవీ.. ప్రస్తుత ఐసీఈ ఫ్లాగ్​షిప్ కొడియాక్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నారు...