భారతదేశం, సెప్టెంబర్ 11 -- బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్​ని ఇండియాలో తాజాగా లాంచ్​ చేసింది శాంసంగ్. దాని పరు గెలాక్సీ ఎఫ్​17. ఇదొక 5జీ స్మార్ట్​ఫోన్​. ఈ ఫోన్ నీటి తుంపరలు, ధూళి నుంచి రక్షణ కోసం ఐపీ54 రేటింగ్‌తో వచ్చింది. అంతేకాకుండా ఇందులో 'సర్కిల్ టు సెర్చ్', 'జెమినీ లైవ్' వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

గెలాక్సీ ఎఫ్​17 5జీలో 6.7 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ సూపర్ అమోఎల్​ఈడీ డిస్‌ప్లే ఉంది. ఇది 90 హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్​తో వస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణ కవచం ఉంది.

ఈ ఫోన్‌లో 5,000ఎంఏహెచ్​ బ్యాటరీని ఉపయోగించారు. ఇది 25డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే, శాంసంగ్ ఇందులో 5ఎన్​ఎం ఆధారిత ఎక్సీనోస్ 1330ని వాడింది. ఈ స్మార్ట్​ఫోన్​లో 8జీబీ ర్యామ్​- 1...