భారతదేశం, మే 24 -- నైరుతి రుతుపవనాలపై బిగ్​ అప్డేట్​! ఇంకో 24 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. సాధారణంగా జూన్​ మొదటి వారంలో దేశాన్ని తాకే రుతుపవనాలు ఈసారి మే 27నే వస్తాయని ఐఎండీ (భారత వాతావరణశాఖ) తొలుత అంచనా వేసింది. కానీ ఇప్పుడు మరో 24 గంటల్లోనే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. రుతుపవనాలు ఇంత త్వరగా కేరళను తాకడం 16ఏళ్లల్లో ఇదే తొలిసారి!

కేరళలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా రుతుపవనాలు కేరళను త్వరగా తాకేందుకు ఈసారి అన్ని సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే ఈసారి రుతుపవనాలు త్వరగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నట్టు ఐఎండీ వెల్లడించింది.

భారత వాతావరణశాఖ ప్రకారం.. చివరిసారిగా 2001, 2009లో మే 23వ తేదీన రుతుపవనాలు కేరళను తాకాయి. కాగా 1918 మే 11న రుతుపవనాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇక 1972 ఏడాదిలో జూన్​ 18న నైర...