భారతదేశం, మే 6 -- పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం చేసిన సిఫార్సుల మేరకు మే7, బుధవారం 'సెక్యూరిటీ మాక్​ డ్రిల్స్​'ని నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్​తో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలోనే రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సెక్యూరిటీ డ్రిల్స్​ నిర్వహించాలని కేంద్రం చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

చివరిసారిగా దేశంలో 1971 యుద్ధానికి ముందు ఈ తరహా డ్రిల్​ జరిగింది! నాటి యుద్ధంలో భారత్​ చేతిలో పాక్​ ఓడిపోవడమే కాదు, బంగ్లాదేశ్​ అనే కొత్త దేశం ఉద్భవించింది.

కాగా మే 7, బుధవారం నాడు జరిగే సెక్యూరిటీ డ్రిల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్​ ప్రకారం.. 244 సివిల్​ డిఫెన్స్​ డిస్ట్రిక్ట్స్​లో ఈ డ్రిల్​ జరుగుతుంది. గ్రామ స్థాయిల నుంచి...