భారతదేశం, జూన్ 5 -- భారత్ పొరుగున ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సహా 12 దేశాల పౌరులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పూర్తి స్థాయి ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇతర దేశాలలో మయన్మార్, ఇరాన్, లిబియా ఉన్నాయి. ఈ 12 దేశాలతో పాటు మరో 7 దేశాలపై పాక్షిక ఆంక్షలు విధించారు. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం సంతకం చేశారు.

ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, చాద్, రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, యెమెన్ దేశాల నుంచి వచ్చే పౌరులపై ఈ డిక్లరేషన్ పూర్తిగా ఆంక్షలు విధించింది. అలాగే, బురుండి, క్యూబా, లావోస్, సియెర్రా లియోన్, టోగో, తుర్క్మెనిస్తాన్, వెనిజులా దేశాలకు పాక్షిక ఆంక్షలు వర్తిస్తాయని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఆఫ్ఘనిస్తాన్ పై తాలిబన్ నియంత్రణ, ఇరాన్, క్యూబా ప్రభుత్...