భారతదేశం, ఫిబ్రవరి 13 -- వారంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావంపై తలెత్తిన ఆందోళనలు ఇన్వెస్టర్లలో భయాందోళనలు రేకెత్తించాయి.

ఫిబ్రవరి 13, శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,048 పాయింట్లు (1.25%) పతనమై 82,626.76 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 50 కూడా 336 పాయింట్లు (1.30%) నష్టపోయి 25,471.10 వద్ద ముగిసింది. మధ్య తరహా, చిన్న తరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇంకా ఎక్కువగా కనిపించింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ 1.58%, స్మాల్‌క్యాప్ 1.50% మేర క్షీణించాయి.

ఈ ఒక్క రోజే మదుపర్ల సంపద దాదాపు రూ. 7 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 472 లక్షల కోట్ల నుంచి రూ....