భారతదేశం, ఏప్రిల్ 27 -- ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎలక్ట్రిక్​ వెహికిల్​గా దూసుకెళుతోంది ఎంజీ విండ్సర్​ ఈవీ. లాంచ్​ అయిన 6 నెలల్లోనే 20వేలకుపైగా యూనిట్లు విక్రయించి రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు ఈ మోడల్​పై బిగ్​ అప్డేట్​ బయటకు వస్తోంది! ఎంజీ విండ్సర్​ ఈవీలో కొత్త బ్యాటరీ ప్యాక్​ అందుబాటులోకి రానుందని సమాచారం. దీని ద్వారా ఓవరాల్​ రేంజ్​ మరింత పెరుగుతుందని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఎంజీ విండ్సర్ ఈవీ ప్రస్తుతం 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్​తో అందుబాటులో ఉంది. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్ (50.6 కిలోవాట్​) యూనిట్ అందుబాటులోకి రానుంది. ఇది ప్రస్తుత మోడల్​తో పోలిస్తే ఎలక్ట్రిక్ కారుకు పూర్తి ఛార్జ్​పై అధిక రేంజ్​ని ఇస్తుంది.

ఈ విండ్సర్ ఈవీ ఎలక్ట్రిక్​ వెహికిల్​ లాంగ్ రేంజ్ వెర్షన్ వచ్చే నెలలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది...