భారతదేశం, మే 31 -- భారత్, పాకిస్థాన్ ల మధ్య ఇటీవల నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలను తానే పరిష్కరించానని అమెరికా ప్రెసిడెండ్ ట్రంప్ మరోసారి చెప్పారు. ఈ విషయాన్ని పలు వేదికలపై డొనాల్డ్ ట్రంప్ పలుమార్లు వెల్లడించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) నుంచి వైదొలగుతున్న ఎలాన్ మస్క్ కోసం ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ విషయాన్ని మళ్లీ చెప్పారు.

''భారత్, పాక్ లను యుద్ధం చేయకుండా అడ్డుకున్నాం. ఇది అణు విపత్తుగా మారి ఉండేదని నేను నమ్ముతున్నాను. భారత్, పాక్ నేతలకు ధన్యవాదాలు చెబుతున్నాను. నా ప్రజలకు కూడా నేను కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఆ రెండు దేశాల నాయకులతో వాణిజ్యం గురించి మాట్లాడాను. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుతున్న, అణ్వాయుధాలు కలిగి ఉన్న వారితో మేం వాణిజ్యం చేయలేం అని చెప్ప...