భారతదేశం, ఏప్రిల్ 28 -- పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్పై కఠినంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన పలు యూట్యూబ్ ఛానెల్స్ని ఇండియాలో నిషేధించింది. అంతేకాదు, పహల్గామ్ ఉగ్రదాడి కవరేజీ విషయంలో బీబీసీకి ప్రభుత్వం లేఖ రాసింది.
డాన్, సామా టీవీ, ఏఆర్వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి వంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు సహా పాకిస్థాన్కి చెందిన మొత్తం 16 యూట్యూబ్ ఛానళ్లను ప్రభుత్వం నిషేధించింది.
భారతదేశానికి వ్యతిరేకంగా మతపరమైన- సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలతో హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు వీటిని నిషేధించినట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి.
"జమ్ముకశ్మీర్లో విషాదకరమైన పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో భారత్.. దాని సైన్యం, భద్రతా సంస్థలకు వ్యతిరేక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.