భారతదేశం, ఏప్రిల్ 28 -- పహల్గామ్​ ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్​పై కఠినంగా వ్యవహరిస్తున్న భారత ప్రభుత్వం.. తాజాగా ఆ దేశానికి చెందిన పలు యూట్యూబ్​ ఛానెల్స్​ని ఇండియాలో నిషేధించింది. అంతేకాదు, పహల్గామ్​ ఉగ్రదాడి కవరేజీ విషయంలో బీబీసీకి ప్రభుత్వం లేఖ రాసింది.

డాన్, సామా టీవీ, ఏఆర్​వై న్యూస్, జియో న్యూస్, రాజీ నామా, జీఎన్ఎన్, ఇర్షాద్ భట్టి వంటి పలు ప్రముఖ మీడియా సంస్థలు సహా పాకిస్థాన్​కి చెందిన మొత్తం 16 యూట్యూబ్ ఛానళ్లను ప్రభుత్వం నిషేధించింది.

భారతదేశానికి వ్యతిరేకంగా మతపరమైన- సున్నితమైన కంటెంట్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయన్న ఆరోపణలతో హోం మంత్రిత్వ శాఖ సిఫార్సు మేరకు వీటిని నిషేధించినట్లు విశ్వసనీయ వర్గాలు సోమవారం తెలిపాయి.

"జమ్ముకశ్మీర్​లో విషాదకరమైన పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో భారత్.. దాని సైన్యం, భద్రతా సంస్థలకు వ్యతిరేక...