భారతదేశం, జూన్ 3 -- రాజస్థాన్​లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలి నగలను దోచుకోవాలని చూసిన ఓ వ్యక్తి.. ఆమెను చంపి, ఆ తర్వాత దృశ్యం సినిమా తరహాలో మృతదేహాన్ని మాయం చేసేందుకు ప్రయత్నించాడు. శరీరాన్ని దహనం చేసి, మృతదేహాన్ని చెరువులో పడేశాడు. చివరికి పోలీసులకు దొరికిపోయాడు.

రాజస్థాన్​లోని ఉదయ్​పూర్​లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడు రమేష్ లోహర్ 5వ తరగతి డ్రాపౌట్. క్రైమ్ పెట్రోల్ వంటి థ్రిల్లర్లు, ట్రూ క్రైమ్ షోలు చూడటం అతనికి ఇష్టం. నగలు దొంగిలించాలనే ఉద్దేశంతో చాందీ బాయి అనే మహిళను చంపాలని నిర్ణయించుకున్నట్లు అతను పోలీసులకు చెప్పాడని ఉదయ్​పూర్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ తెలిపారు.

ధోలీ వర్గానికి చెందిన చందీ బాయి జనవరి 9న ఓ కార్యక్రమంలో డ్రమ్స్ వాయిస్తుండగా నిందితుడు ఆమెను చూశాడు. ఆ సమయంలో ఆమె భారీ వెండి,...