భారతదేశం, ఏప్రిల్ 17 -- ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! తనకు కేన్సర్​ ఉందని తేలడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, చికిత్సకు డబ్బులు వృథా అవ్వకూడదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు.. తన భార్యను కాల్చి చంపేశాడు.

యూపీ ఘజియాబాద్​లోని నంద్​గ్రామ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసముంటున్న 57ఏళ్ల వ్యక్తి ఒక ప్రాపర్టీ డీలర్​. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన జీవిస్తున్నాడు.

కాగా ఆయనకి కేన్సర్​ ఉందని ఇటీవలే తేలింది. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇంటి గ్రౌండ్​ ఫ్లోర్​లో తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న పిల్లలు తుపాకీ శబ్దానికి ఉల్లిక్కిపడి కిందకు పరిగెత్తారు. అప్పటికే తల్లిదండ్రులు మరణించారు.

ఈ...