భారతదేశం, మే 20 -- బెంగళూరు రోడ్ల దుస్థితి వల్ల తాను భౌతికంగా- మానసికంగా క్షోభకు గురయ్యానని, తనకు రూ. 50లక్షల పరిహారాన్ని చెల్లించాలని.. ఓ 43ఏళ్ల వ్యక్తి బీబీఎంపీ (బృహత్​ బెంగళూరు మహానగర పాలిక)కి నోటీసు పంపించారు. ఎప్పటికప్పుడు పన్నులు చెల్లిస్తున్నప్పటికీ, కనీస మౌలికవసతులను సరిగ్గా నిర్వహించలేకపోతున్న పురపాలక సంఘం వల్ల చాలా కష్టాలు పడినట్టు ఆ వ్యక్తి వివరించారు.

బెంగళూరు రిచ్​మాండ్​ టౌన్​ నివాసి ధివ్య కిరణ్​ బీబీఎంపీకి ఈ నోటీసు పంపించారు. రోడ్ల మీద గుంతల వల్ల తన ఆరోగ్యం దెబ్బతిందని, విపరీతమైన మెడ- వెన్ను నొప్పుల వల్ల ఐదుసార్లు ఆర్థోపెడిక్​ దగ్గరికి, నాలుగుసార్లు హాస్పిటల్స్​కి ఎమర్జెన్సీ విజిట్​ కోసం వెళ్లినట్టు చెప్పారు.

"దారణమైన రోడ్ల మీద ప్రయాణం వల్ల ట్రౌమాకి గురయ్యా," అని కిరణ్​ చెప్పుకొచ్చారు.

ఈ రూ. 50లక్షల నోటీసులపై బీబీఎంపీ ఇంక...