భారతదేశం, మే 7 -- పహల్గామ్​ ఉగ్రదాడికి భారత్​ గట్టి సమాధానం ఇచ్చింది! ఇన్ని రోజులు పాకిస్థాన్​ని ఆర్థికంగా దెబ్బతీసిన భారత్​.. తాజాగా మిలిటరీ చర్యలతో పాక్​తో పాటు పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాదులపై విరుచుకుపడింది. "ఆపరేషన్​ సిందూర్​" పేరుతో అత్యాధునిక ఆయుధ వ్యవస్థను ఉపయోగించి, సరిహద్దు దాటకుండానే పనిని పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్​ సిందూర్​కి సంబంధించిన 10 కీలక విషయాలను ఇక్కడ తెలుసుకోండి..

1. పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్​ దాడి చేసింది. దీనికి 'ఆపరేషన్​ సిందూర్​' అని పేరు పెట్టింది. ఇందులో 4 పాక్​లో, 5 పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఉన్నాయి.

2. భారత్​ దాడి చేసిన 9 ప్రాంతాల్లో బహవల్​పూర్​, మురిడ్కే, సైల్​కోట్​ ఉన్నాయి. వీటి కోఆర్డినేషన్స్​ని నిఘా ఏజెన్సీలు సైన్యంతో పంచుకున్నాయి.

3. తాజా దాడిలో...