భారతదేశం, ఫిబ్రవరి 5 -- ప్రపంచ టెక్‌ దిగ్గజం యాపిల్‌ కంపెనీ. భారత్‌లో రిటైల్‌ స్టోర్స్‌ని విస్తరిసించే పనిలో పడింది. గతేడాది బెంగళూరు, పూణె, నోయిడాలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన ఆ సంస్థ. కొత్తగా హైదరాబాద్‌లోనూ ప్రారంభించడంపై కసరత్తు చేస్తోంది.

కొత్త రిటైల్ స్టోర్ ప్రారంభించే పనుల్లో భాగంగా కీలకమైన రిక్రూట్ మెంట్ ప్రక్రియను పూర్తి చేయనుంది. స్టోర్‌ లీడర్, సీనియర్‌ మేనేజర్‌ తో పాటు ఇతర ఉద్యోగాలను రిక్రూట్ చేయనుంది. ఇందుకు సంబంధించి సంస్థ కెరీర్ పోర్టల్‌లో ఓ పోస్ట్‌ చేసింది.

సాధారణంగా స్టోర్‌ని ప్రారంభించడానికి యాపిల్‌ సుమారు ఏడాది ముందు నుంచి రిక్రూట్‌మెంట్‌ చేపడుతుంది. దీన్ని బట్టి చూస్తే హైదరాబాద్‌ లో 2027లో రిటైల్ స్టోర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అంచనా. అంతేకాకుండా ముంబైలో ఈ ఏడాది మరో స్టోర్ ను కూడా ప్రారంభించేందుకు కసరత్తు ...