భారతదేశం, జూన్ 9 -- రాజ రఘువంశి- సోనమ్​.. ఈ రెండు పేర్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. హనీమూన్​ కోసం కొత్త దంపతులు మేఘాలయకు వెళ్లడం, అక్కడ ఇద్దరు అదృశ్యమవ్వడంతో మొదలైన వ్యవహారం.. చివరికి ఎవరూ ఉహించని మలుపు తిరిగింది! భర్తను భార్య చంపించిందని, సోనమ్​కి ఉన్న వివాహేతర బంధం దీనికి కారణం అని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు పోలీసుల ఎదుట లొంగిపోయిన తన కూతురు తప్పేమీ లేదని, ఆమెను ఇరికిస్తున్నారని సోనమ్​ తండ్రి ఆరోపిస్తున్నాడు.

మధ్యప్రదేశ్​కి చెందిన రాజ రఘువంశి (29)- సోనమ్​ (24)లకు మే 11న వివాహం జరిగింది. అనంతరం హనీమూన్​ కోసం మేఘాలయ వెళ్లారు. అనంతరం మే 23న కొత్త దంపతులు కనిపించకుండా పోయారు. ఉన్నట్టుండి వారు అదృశ్యం అవ్వడం సర్వత్రా ఆందోళన కలిగించింది. తొలుత వారు కిడ్నాప్​కి గురయ్యారని పోలీసులు భావించారు. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యా...