భారతదేశం, జూన్ 8 -- అదానీ గ్రూప్​ వ్యవస్థాపకుడు గౌతమ్​ అదానీ ఎఫ్​వై25 జీతానికి సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. భారత దేశ సంపన్నుల జాబితాలో రెండో స్థాంలో ఉన్న అదానీ వేతనం.. ఇతర కంపెనీల వ్యవస్థాపకులతో పాటు తన సొంత కంపెనీల్లోని కీలక ఉద్యోగుల కన్నా చాలా తక్కువ అని ఇది సూచిస్తోంది.

బ్లూమ్​బర్గ్​ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం గౌతమ్ అదానీ సంపద 82.5 బిలియన్ డాలర్లు. ఇక ప్రపంచ ధనవంతుల జాబితా 2025లో ఆయన 20వ స్థానంలో ఉన్నారు.

అదానీ తనకున్న అనేక కంపెనీల్లో కేవలం రెండింటి నుంచే జీతాలు తీసుకుంటున్నారు.

గౌతమ్ అదానీ ఎఫ్​వై2025 (మార్చ్​ 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరం)లో మొత్తం రూ .10.41 కోట్ల వేతనాన్ని అందుకున్నట్లు గ్రూప్ కంపెనీల తాజా వార్షిక నివేదికలు చెబుతున్నాయి. అదానీ ఎంటర్​ప్రైజెస్ (ఏఈఎల్) నుంచి గౌతమ్ అదానీ రూ.2.54 కోట్లు జీతంగా తీసుకున్నార...