భారతదేశం, జనవరి 31 -- తెలుగు, తమిళ సినీ ఇండస్ట్రీల్లో ఐశ్వర్య రాజేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. 2025లో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో తెలుగు ఆడియన్స్ కు మరింత చేరువైంది. అయితే ఈ హీరోయిన్ చిత్ర పరిశ్రమల్లో స్టార్‌గా ఎదిగే ముందు ఒక ఫోటోగ్రాఫర్ తనను లైంగికంగా వేధించాడని సంచలన ఆరోపణలు చేసింది.

హీరోయిన్ గా వెలుగులోకి రాకముందు తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని ఐశ్వర్య రాజేష్ పంచుకుంది. నిఖిల్ విజయేంద్ర సింహాతో జరిగిన ఓ పాడ్‌కాస్ట్‌లో యంగ్ ఏజ్ లో ఒక ఫోటోషూట్ సమయంలో ఫొటోగ్రాఫర్ లైంగికంగా వేధించేందుకు ప్రయత్నించాడని ఐశ్వర్య తెలిపింది. లింగరీ (లో దుస్తులు) ధరించాలని, బాడీ చూస్తామని అన్నాడని చెప్పింది.

ఐశ్వర్య రాజేష్ పాడ్ కాస్ట్ లో మాట్లాడుతూ.. "నేను సినిమాల్లోకి రాకముందు ఈ ఘటన జరిగింది. నన్ను ఓ ఫోటోషూట్‌కు పిలిచారు. నేను నా బ్రదర్ తో కలిసి వెళ్...