భారతదేశం, మే 3 -- సూప‌ర్ నాచుర‌ల్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందిన నందిని సీరియ‌ల్ మ‌రోసారి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. నందిని సీరియ‌ల్‌ను రీ టెలికాస్ట్ చేయ‌బోతున్న‌ట్లు జెమిని టీవీ ప్ర‌క‌టించింది. మే 12 నుంచి ఈ సీరియ‌ల్‌ను జెమిని టీవీలో చూడొచ్చు.

రీ టెలికాస్ట్ డేట్‌ను ప్ర‌క‌టించిన జెమిని టీవీ టైమ్‌ను మాత్రం రివీల్ చేయ‌లేదు. మ‌ధ్యాహ్నం స్లాట్‌లోనే ఈ సీరియ‌ల్ ప్ర‌సార‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

నందిని సీరియ‌ల్ తెలుగులో సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో బుల్లితెర అభిమానుల‌ను మెప్పించింది. నందిని సీరియ‌ల్‌లో నిత్యారామ్ లీడ్ రోల్‌లో న‌టించింది. రాహుల్ ర‌వి, మాళ‌వికా వేల్స్‌, రియాజ్ ఖాన్‌, విజ‌య్ కుమార్ కీల‌క పాత్ర‌లు పోషించారు.

ఈ ఫాంట‌సీ సీరియ‌ల్‌లో సీనియ‌ర్ హీరోయిన్ ఖుష్బూ ఓ ఇంపార్టెంట్ ర...