భారతదేశం, జూన్ 10 -- సిట్రోయెన్ సంస్థ భారత మార్కెట్​లో తన నాల్గొవ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో కస్టమర్స్​కి క్రేజీ న్యూస్​ని అందించింది. పలు ఎంపిక చేసిన మోడళ్లపై రూ.2.80 లక్షల వరకు ఆఫర్స్​ని ఇస్తున్నట్టు వెల్లడించింది. ఇవి జూన్ 30 వరకు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుత సిట్రోయెన్ వినియోగదారులు ఈ కాలంలో ఉచిత కారు స్పా పొందడానికి అర్హులు. వార్షికోత్సవ ఆఫర్ల గురించి మరింత సమాచారం, కస్టమర్​లు Citroen.in ని సందర్శించవచ్చు లేదా వారి సమీప షోరూమ్​కి వెళ్లొచ్చు.

స్టెలాంటిస్ ఇండియా ఆటోమోటివ్ బ్రాండ్స్ బిజినెస్ హెడ్ అండ్​ డైరెక్టర్ కుమార్ ప్రియేష్ మాట్లాడుతూ.. "భారతదేశంలో మా ప్రయాణం సృజనాత్మకత, ఆశయం, వినియోగదారులకు అర్థవంతమైన విలువను అందించడంపై స్పష్టమైన దృష్టితో నడుస్తోంది. కేవలం నాలుగు సంవత్సరాల్లో, మేము సిట్రోయెన్ గ్లో...