భారతదేశం, మే 17 -- కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక అత్యంత దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది! సిగరెట్​ కొనివ్వలేదన్న కోపంతో, ఓ వ్యక్తి- మరో వ్యక్తిని తన కారుతో ఢీకొట్టి చంపేశాడు. వీరిద్దరికి అసలు పరిచయమే లేకపోవడం గమనార్హం.

విజరహళ్లికి చెందిన 29ఏళ్ల సంజీవ్​ ఓ టెక్​ కంపెనీలో పనిచేస్తున్నాడు. మే10న సంజయ్​, తన స్నేహితుడు చేతన్​ పుజామథ్​తో కలిసి సిగరెట్​ తాగేందుకు అర్థరాత్రి వేళ ఆఫీస్​ నుంచి బైక్​ మీద బయటకు వెళ్లాడు. ఇద్దరు కలిసి కనకపుర రోడ్డు దగ్గర ఉన్న వసంతపుర క్రాసింగ్​ వద్ద సిగరెట్​ కొని, తాగుతున్నారు. ఆ సమయంలో వారి ముందు ఒక కారు వచ్చి ఆగింది. విండో తీసిన డ్రైవర్​, కారు దిగకుండానే.. తనకు ఒక సిగరెట్​ కొనివ్వాలని సంజయ్​ని అడిగాడు. సంజయ్​ ఒప్పుకోలేదు. అంతేకాదు, కారులో నుంచి బయటకి రావడానికి బద్ధకమా అన్నట్టు మాట్లాడాడని సమాచారం.

ఇది ...