భారతదేశం, మే 15 -- తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం క్షేత్రంలో జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ఏర్పాటు చేసింది. సరస్వతీ నది పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసంవిజయవాడ నుంచి సూపర్‌ లగ్జరీ, ఇంద్ర ఏసీ సర్వసుల్ని అందుబాటులోకి తెచ్చింది.

కాళేశ్వరం త్రివేణి సంగమంలో జరుగుతున్న సరస్వతీ నది పుష్కరాలకు విజయవాడ నుంచి వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రత్యేక బస్సుల్ని ప్రకటించింది. గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే త్రివేణి సంగమంలో మే 15 నుంచి 26 వరకు సరస్వతీ పుష్కరాలు జరుగుతాయి.

కాళేశ్వరం, త్రివేణి సంగమ యాత్రలకు విజయవాడ నుంచి ప్రత్యేక బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విజయవాడ ఎన్టీఆర్‌ బస్‌ టెర్మినల్‌ నుంచి ఈ సర్వసులు నడుస్తాయి. మే 16వ తేదీ నుంచి 25 తేదీ ...