భారతదేశం, జనవరి 31 -- మేడారం జాతర అత్యంత ఘనంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరి మూడు రోజులుగా పూజలందుకున్న వనదేవతలను భక్తజన సందోహాం మధ్య పూజారులు వన ప్రవేశం చేయించారు. శనివారం సాయంత్రం నిర్వహించిన ఈ వేడుక ఆద్యంతం ఉద్వేగభరితంగా సాగింది.

సమ్మక్కను సాగనంపే క్రతవు అత్యంత ఉద్వేగభరితంగా ముందుకు సాగింది. సమ్మక్కను గద్దె నుంచి తీసుకొని చిలకలగుట్టకు చేర్చే వరకు దారిపొడవునా భక్తులు వెంటనడిచారు. ప్రత్యేక నృత్యాలు, వాయిద్యాల చప్పుళ్ల మధ్య ఈ క్రతువు పూర్తి అయింది. మరోవైపు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను సైతం ఆయా పూజారులు తమ ప్రాంతంలోని గుళ్లకు తీసుకెళ్లారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....