భారతదేశం, జూన్ 10 -- అమెరికాలో జరిగిన ఒక షాకింగ్​ ఘటన ఇప్పుడు సోషల్​ మీడియాను ఊపేస్తోంది! ఓ 33ఏళ్ల మహిళ మరణించిన 8 నిమిషాలకు కళ్లు తెరిచింది! తొలుత ఆమెలో చలనం లేదు, ఊపిరి తీసుకోలేదు, మెదడు పనిచేయలేదు, పల్స్​ కూడా లేదు. అందుకే ఆమె చనిపోయిందని వైద్యులు ధ్రువీకరించారు. అయితే, మళ్లీ బతికింది! ఆ తర్వాత.. మరణానంతర జీవితం గురించి ఆమె అనేక విషయాలను చెప్పింది.

ఆ మహిళ పేరు బ్రియన్నా లాఫెర్టీ. మరణం నుంచి తిరిగి రావడంపై ఆమె మీడియాకు ఈ విధంగా చెప్పింది.

"మరణం అనేది ఒక భ్రాంతి. ఎందుకంటే మన ఆత్మ ఎప్పటికీ చావదు. మనం స్పృహలోనే ఉంటాము. మన ఆత్మ వేరే చోటకు వెళుతుంది," అని బ్రియన్నా చెప్పుకొచ్చింది.

మరణం తర్వాత తిరిగి జీవితం పొందడం గురించి మాట్లాడుతు.. "నొప్పి లేదు. అంతా ప్రశాంతంగా, క్లియర్​గా అనిపించింది," అని వివరించింది.

"నా భౌతిక దేహం నుంచి నన్ను ఉన్న...