భారతదేశం, ఫిబ్రవరి 1 -- మహా శివరాత్రి పండుగ దగ్గరకు వస్తోంది. దీంతో శ్రీశైలం క్షేత్రానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం ఆలయంలో సన్నాహాలు ముమ్మరం చేశారు. మూడు రోజుల పండుగ సమయంలో సుమారు ఏడు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 15న మహా శివరాత్రి ఉంది.

భక్తుల సంఖ్య పెరిగే నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ శాఖల సంయుక్త పర్యవేక్షణలో విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో ప్రధాన శివరాత్రి గమ్యస్థానాలలో ఒకటిగా శ్రీశైలం ఉంది. పండుగ సమయంలో శ్రీశైలంలో భారీగా జనసందోహం చూసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

శ్రీశైలం ఆలయం నంద్యాల జిల్లా పరిధిలోకి వచ్చినప్పటికీ, ఇది మార్కాపురం జిల్లా సరిహద్దుకు దగ్గరగా ఉంది. ఈ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రె...