భారతదేశం, ఫిబ్రవరి 17 -- ఫేమస్ అవ్వడానికి కొంతమంది చేసే పనులు ఘోరంగా ఉంటున్నాయి. పవిత్రమై దేవాలయాల దగ్గర కూడా ఈ రీల్స్ పిచ్చి చాలామందికి ఎక్కువైపోయింది. ఏంకాదులే అని చేసే పనులతో చట్టపరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. తాజాగా కొందరు యువకులు శివరాత్రినాడు శివుడికి గంజాయి ప్రసాదంగా సమర్పించారు. ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో రంగంలోకి దిగారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

మహాశివరాత్రి రోజున గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిందనే చెప్పాలి. దేవాలయం దగ్గర శివుడికి గంజాయిని ప్రసాదంగా సమర్పించారు కొందరు ప్రబుద్ధులు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది బాగా వైరల్ అయింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే సజ్జనార్ స్పందించారు.

వీడియోలో కనిపించిన వ్యక...