భారతదేశం, జూన్ 6 -- అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఓ ఇంటి వాడయ్యారు. తన ప్రేయసి జైనాబ్ రవ్జీని అఖిల్ పెళ్లాడారు. నేటి (జూన్ 6) తెల్లవారుజామున జూబ్లిహిల్స్‌లోని నాగార్జున నివాసంలో అఖిల్, జైనాల్ వివాహం వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొందరు సినీ సెలెబ్రిటీలు ఈ వేడుకకు హాజరయ్యారు.

అఖిల్ - జైనాబ్ వివాహ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ హాజరయ్యారు. వారితో పాటు రామ్‍చరణ్, ఉపాసన దంపతులు కూడా పెళ్లికి వచ్చారు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, శర్వానంద్, దర్శక ధీరుడు రాజమౌళి, అతడి కుమారుడు కార్తికేయతో పాటు మరికొందరు సినీ సెలెబ్రిటీలు హాజరయ్యారు. భారత క్రికెటర్ తిలక్ వర్మ కూడా పెళ్లికి వచ్చారు. వివాహంలో అఖిల్ సోదరుడు, హీరో నాగచైతన్య సందడి చేశారు. చైతూ భార్య శోభితా ధూళిపాళ్ల చీరకట్టులో మెరిశారు....