భారతదేశం, మే 27 -- ఏపీలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతికి చెక్‌ పెట్టడంతో పాటు ఉద్యోగుల ప‌నితీరు మెరుగుప‌రిచేలా బ‌దిలీలు చేప‌ట్ట‌నున్నారు. మూడేళ్లు ఒకేచోట ప‌నిచేసిన వైద్య ఆరోగ్య శాఖ స‌హాయ‌క సిబ్బంది బ‌దిలీ చేస్తారు. ప‌నితీరు ఆధారంగా ప్రిన్సిపాళ్లు, సూప‌రింటెండెంట్ల స్ధానాలను మార్చేందుకు ఆరోగ్య శాఖ‌కు ప్ర‌త్యేక వెసులుబాటు ముఖ్య‌మంత్రి కల్పించారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం అనుమ‌తించిన సాధార‌ణ బ‌దిలీ ప్ర‌క్రియ‌ను అవినీతికి అడ్డుక‌ట్ట వేయ‌డంతో పాటు అత్యున్న‌త వైద్యుల ప‌నితీరు మెరుగుప‌రిచే దిశ‌గా వినియోగించ‌డానికి వైద్యారోగ్య శాఖ నిర్ణ‌యించింది. బ‌దిలీల‌కు సంబంధించి కొన్ని వైద్య ఆరోగ్య శాఖకు ప్ర‌త్యేక స‌డ‌లింపుల‌కు ముఖ్య‌మంత్రి ఆమోదం తెలిపారు.

వైద్యారోగ్య శాఖ‌లో పెద్ద సంఖ్య‌లో ఉద్యోగులు విధులు నిర్వ‌హిస్తుండటంతో కొన్ని క్లిష్ట‌మైన అంశాలు, వైద్య శాఖకు స...