భారతదేశం, మే 12 -- అమెరికా- చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధంపై బిగ్​ అప్డేట్​! ఇరు దేశాలు ఒకదానిపై మరొకటి వేసుకున్న టారీఫ్​లను తగ్గించుకునేందుకు ఒప్పుకున్నాయి. ఈ క్రమంలో అమెరికా నుంచి వచ్చే వస్తువులపై సుంకాలను 90 రోజుల పాటు 125 శాతం నుంచి 10 శాతానికి తగ్గించనున్నట్టు బీజింగ్ ప్రకటించింది. జెనీవాలో జరుగుతున్న వాణిజ్య చర్చల సందర్భంగా చైనా వస్తువులపై సుంకాలను 145 శాతం నుంచి 30 శాతానికి తగ్గించాలని అమెరికా నిర్ణయించింది.

వాణిజ్య ఉద్రిక్తతలను చల్లార్చేందుకు, ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు తమ సమస్యల పరిష్కారానికి మరో మూడు నెలల సమయం ఇస్తూ, పరస్పరం ఉత్పత్తులపై తాత్కాలికంగా సుంకాలను తగ్గించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మంచి పరిణామం అని నిపుణులు చెబుతున్నారు.

చాలా చైనా దిగుమతులపై మొత్తం 145% యూఎస్ సుంకాలు మే 14 నాటికి, ఫెంటానిల్​ (...