భారతదేశం, ఆగస్టు 12 -- దేశీయ స్టాక్​ మార్కెట్​లో అవాన్స్ టెక్నాలజీస్ షేరు ధర దూసుకెళుతోంది. భారీ కొనుగోళ్ల మధ్య సోమవారం బీఎస్‌ఈలో ఈ పెన్నీ స్టాక్​ 2శాతం పెరిగి, అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఈ స్మాల్-క్యాప్ స్టాక్ రూ. 1.56 వద్ద తన 52 వారాల గరిష్టాన్ని కూడా నమోదు చేసింది. అంతేకాదు, ఇదొక మల్టీబ్యాగర్​ స్టాక్​ కూడా!

గత 20 ట్రేడింగ్ సెషన్స్​ నుంచి ఈ పెన్నీ స్టాక్ నిరంతరం అప్పర్ సర్క్యూట్‌ను తాకుతోంది. అంతేకాదు, గత 30 సెషన్స్​లోనే ఈ షేర్ ఏకంగా 81శాతం పైగా పెరగడం విశేషం!

అవాన్స్ టెక్నాలజీస్ ఇటీవల తన త్రైమాసిక ఫలితాలను సమీక్షించడానికి బోర్డు సమావేశం తేదీని ప్రకటించింది. ఆగస్టు 8న చేసిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ ఈ వివరాలను తెలిపింది.

కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల సమావేశం గురువారం, ఆగస్టు 14, 2025న జరగనుంది. ఈ సమావేశంలో జూన్ 30, 2025తో ముగిసి...