భారతదేశం, ఫిబ్రవరి 4 -- మెగా ఫ్యామిలీలో ఇప్పుడు సంబరాలు కొనసాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత అయ్యారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ట్విన్స్ కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో ఒక పాప, బాబు ఉన్నారు. అయితే చిరంజీవి గతంలో మనవడు కావాలని చేసిన కామెంట్లను ప్రస్తావిస్తూ లింగ వివక్ష అంటూ ఇప్పుడు కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫైర్ అయింది.

మామయ్య చిరంజీవిపై వస్తున్న లింగ వివక్ష ఆరోపణలపై లావణ్య త్రిపాఠి స్పందించింది. గతంలో చిరంజీవి తన నలుగురు మనవరాళ్ల గురించి ప్రస్తావిస్తూ ఒక మనవడిని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఒక జర్నలిస్ట్ చిరంజీవిపై వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనిపై లావణ్య త్రిపాఠి ఫైర్ అయింది.

''నా టైమ్ లైన్ లో సాధారణంగా ఇలాంటి ట్వీట్లను పట్టించుకోను. కానీ మీ నుంచి ఇది ఊహించలేదు. ఇ...