భారతదేశం, మే 7 -- రోడ్డు ప్రమాదాలు అత్యంత ఆందోళనకరంగా ఉన్న వేళ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాద బాధితులకు మొదటి ఏడు రోజులు నిర్దేశిత ఆసుపత్రుల్లో రూ.1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుందని వెల్లడించింది. ఈ పథకం 2025 మే 5 నుంచి అమల్లోకి వచ్చినట్లు తాజా నోటిఫికేషన్​లో పేర్కొంది.

సకాలంలో వైద్యం అందించడంలో జాప్యం కారణంగా ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా.. ది క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​ ఆఫ్​ రోడ్​ యాక్సిడెంట్​ విక్టిమ్స్​ స్కీమ్​ 2025" (రోడ్డు ప్రమాద బాధితుల నగదు రహిత చికిత్స పథకం)ని అమలు చేసింది ప్రభుత్వం. మోటారు వాహనాన్ని ఉపయోగించడం వల్ల సంభవించే రోడ్డు ప్రమాదానికి గురైన ఏ వ్యక్తి అయినా ఈ పథకం నిబంధనలకు అనుగుణంగా నగదు రహిత చికిత్సకు అర...