భారతదేశం, జూన్ 2 -- సబ్సిడీలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటానికి భారత ప్రభుత్వం.. ఆధార్ కార్డును- రేషన్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. మోసపూరిత రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించడం, రేషన్ ప్రయోజనాల పంపిణీని మెరుగుపరచడం ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశం. లింకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆన్​లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రేషన్​ కార్డును ఆధార్​ కార్డుతో సులభంగా ఎలా లింక్​ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..

స్టెప్​ 1: మీ రాష్ట్ర అధికారిక ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) వెబ్సైట్​ని సందర్శించండి. ఆధార్ లింకింగ్ కోసం సంబంధిత విభాగాన్ని యాక్సెస్ చేయడానికి మీరు మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.

స్టెప్​ 2: లాగిన్ అయిన తర్వాత, మీ ఆధార్​ను మీ రేషన్ కార్డుకు లింక్ చే...