భారతదేశం, జూలై 5 -- చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ) ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ మే 2025 పరీక్షల ఫలితాలను రేపు, అంటే జులై 6న ప్రకటించనుంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ). ఫలితాలు విడుదలైన తర్వాత, అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్ icai.nic.in లో వాటిని చెక్​ చేసుకోవచ్చు.

ఫలితాలను తనిఖీ చేయడానికి, అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్​తో పాటు రోల్ నంబర్​ని ఉపయోగించాల్సి ఉంటుంది.

అధికారిక నోటీసు ప్రకారం, ఐసీఏఐ సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాలు మధ్యాహ్నం 2 గంటలకు అటు, ఇటు విడుదల అవుతాయి. సీఏ ఫౌండేషన్ ఫలితాలు సాయంత్రం 5 గంటలకు ప్రకటిస్తారు.

ఈ ఏడాది మే 2 నుంచి మే 14 వరకు సీఏ మే పరీక్షలను నిర్వహించింది ఐసీఏఐ.

గ్రూప్ 1కు సంబంధించిన ఇంటర్మీడియట్ పరీక్ష మే 3, 5, 7 తేదీలలో, గ్రూప్ 2 పరీక్ష మే 9, 11, 14 తేదీలలో నిర్వహించారు. ...