భారతదేశం, ఫిబ్రవరి 1 -- టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి గురించి గత కొన్నాళ్లుగా వస్తున్న వార్తలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. ముఖ్యంగా 2025 అక్టోబర్‌లో వీరి నిశ్చితార్థం జరిగిందన్న ఊహాగానాలు వచ్చినప్పటి నుంచి వీరిద్దరూ ఎప్పుడు ఒక్కటవుతారా అని అభిమానులు వేచి చూస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ చర్చకు మరింత ఆజ్యం పోసింది.

రాజస్థాన్‌లోని చారిత్రాత్మక ఉదయ్‌పూర్ సిటీ ప్యాలెస్‌లో భారీ స్థాయిలో అలంకరణలు జరుగుతున్న దృశ్యాలు ఒక వీడియో రూపంలో బయటకు వచ్చాయి. ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు ప్యాలెస్‌లోని అలంకరణలను (డెకరేషన్స్) చూపిస్తూ, "ఫిబ్రవరి 2న విజయ్, రష్మికల వివాహం ఇక్కడే జరగబోతోంది" అని చెప్పడం విశేషం. ప్యాలెస్‌లో ఏర్పాటు చేస్తున్న భారీ వేదికలు, పూల అలంకరణలు, షాండ్లియర్లు (ఝుమర్లు...