భారతదేశం, మే 27 -- ఓటీటీలో కొత్త కంటెంట్ చూద్దామని అనుకుంటున్న వారికి రేపు (మే 28) రెండు కొత్త చిత్రాలు అందుబాటులోకి రానున్నాయి. కన్నడ మిస్టరీ థ్రిల్లర్ సినిమా అజ్ఞాతవాసి స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇవ్వనుంది. ఓ పాపులర్ హాలీవుడ్ సూపర్ హీరో చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ వెబ్ సిరీస్ కూడా ఎంట్రీ ఇవ్వనుంది. రేపు ఓటీటీలోకి రానున్న రెండు చిత్రాలు, సిరీస్‍లు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

కన్నడ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ 'అజ్ఞాతవాసి' మూవీకి థియేట్రికల్ రిలీజ్‍లో పాజిటివ్ టాక్ వచ్చింది. రంగనాయన రఘు, పావన గౌడ, సిద్ధు మూలిమణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మోస్తరు హిట్ కొట్టింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తోంది. రేపు (మే 28) జీ5 ఓటీటీలో అజ్ఞాతవాసి చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే ఈ అర్ధరాత్రే స్ట్రీమింగ్ షురూ అ...