భారతదేశం, జూన్ 3 -- ఇన్ఫీనిక్స్ సంస్థ మరో కొత్త స్మార్ట్​ఫోన్​ని ఇండియాలో తాజాగా లాంచ్​ చేసింది. దీని పేరు ఇన్ఫీనిక్స్ జీటీ 30 ప్రో. భారతదేశంలో రూ .25,000 లోపు ధర శ్రేణిలో ఇది అందుబాటులోకి వచ్చింది. ఫ్లాట్ అమోఎల్ఈడీ డిస్​ప్లే, వెనుక భాగంలో లైటింగ్, బైపాస్ ఛార్జింగ్ వంటి వివిధ గేమింగ్ ఫోకస్డ్ ఫీచర్లతో గత ఏడాది వచ్చిన జీటీ 20 ప్రోకి ఇది సక్సెసర్​! పైగా ఈ స్మార్ట్​ఫోన్​ కేవలం 200 గ్రాముల లోపు ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ మొబైల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

ఇన్ఫీనిక్స్ జీటీ 30 ప్రో 8 జీబీ ర్యామ్/ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. 12 జీబీ ర్యామ్/ 25 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999.

అయితే కంపెనీ జీటీ 30 ప్రోతో ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తోంది. ఇది సేల్​ రోజు ధరను వరుసగా రూ .22,999, రూ .24,999కు తీసుకువెళుతుంది. ...