భారతదేశం, ఏప్రిల్ 22 -- ఇండియా మార్కెట్​లో సరికొత్త స్మార్ట్​ఫోన్​ని రిలీజ్​ చేసింది ఒప్పో సంస్థ. దీని పేరు ఒప్పో కే13. ఇది రూ. 20వేల ధరలోపు విభాగంలో ఇప్పటికే ఉన్న పోటీని మరింత పెంచే విధంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ 5జీ స్మార్ట్​ఫోన్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఒప్పో కే13 8 జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 కాగా, 8 జీబీ ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999.

ఫ్లిప్​కార్ట్, ఒప్పో సొంత వెబ్​సైట్, ఆఫ్​లైన్ స్టోర్లలో ఏప్రిల్ 25 నుంచి ఈ స్మార్ట్​ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

ఒప్పో కే13 5జీలో 6.67 ఇంచ్​ ఫుల్ హెచ్​డీ+ అమోఎల్ఈడీ డిస్​ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​ వంటివి ఉన్నాయి. 8.45 ఎంఎం థిక్​నెస్​, 208 గ్రాముల బరువుతో ఈ స్మార్ట్​ఫోన్ బాక్...