భారతదేశం, మే 24 -- నైరుతి రుతుపవనాలు ఈ నెల 27న దేశంలోకి ప్రవేశిస్తాయని అంచనాలు ఉన్నాయి. అయితే, రుతుపవనాలు తాకకముందే కేరళవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. తిరువనంతపురం జిల్లాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంల శుక్రవారం సాయంత్రం ఈ జిల్లాకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్​ని కూడా జారీ చేసింది.

మరికొన్ని రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, రాబోయే వారంలో కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో త్రిసూర్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

24 నుంచి 26 వరకు కన్నూర్, కాసర్గోడ్, మే 25, 26 తేదీల్లో మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశా...