భారతదేశం, జూన్ 8 -- అమెరికాలో ఓ యువతిని దారుణంగా హత్య చేసి, ఆమె రొమ్ములను 'ట్రోఫీ'గా దాచుకున్న ఒక వ్యక్తి తాజాగా దోషిగా తేలాడు. అతని ఫోన్​లో కనిపించిన ఫొటోలు చూసి కోర్టులో ఉన్న వారు షాక్​ అయ్యారు. చాలా మంది కన్నీళ్లు పెట్టుకున్నారు.

అమెరికా విస్కాన్సిన్​లో 2024 ఏప్రిల్​లో జరిగింది ఈ ఘటన. 34ఏళ్ల మ్యాక్స్​వెల్​ ఆండర్సన్​కు 19ఏళ్ల సాడె కర్లీనా రాబిన్​సన్​తో​ పరిచయం ఏర్పడింది. తొలిసారి వారిద్దరు డేట్​కి వెళ్లారు. రెస్టారెంట్​లో కొంత సమయం గడిపారు. ఆ తర్వాత ఆండర్సన్​, ఆ యువతిని.. మిల్వాకీలోని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆమె అతని ఇంటికి వెళ్లింది.

కానీ ఆ మరుసటి రోజు నుంచి ఆమె ఎవరికి కనిపించలేదు!

ఆ యువతి పిజ్జా స్టోర్​లో పనిచేస్తూ, క్రిమినల్​ జస్టిస్​ చదువుకుంటోంది. మరుసటి రోజు ఆమె పనికి రాకపోవడంతో అనుమానం వచ్చి సంబంధిత వర్గాలు మిస్సంగ్​ కేసు పెట్...