భారతదేశం, ఫిబ్రవరి 5 -- టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. దాయాది దేశం పాకిస్థాన్ ఈ మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తుండగా, టీమిండియా మాత్రం తన వైఖరిని స్పష్టం చేసింది. గురువారం (ఫిబ్రవరి 5) ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ నిర్ణయంతో సంబంధం లేకుండా తాము శ్రీలంక వెళ్తున్నామని తేల్చిచెప్పాడు.

ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్‌పై నెలకొన్న సందిగ్ధత గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ.. "మా మైండ్‌సెట్ చాలా క్లియర్‌గా ఉంది. మేము ఆడమని చెప్పలేదు. ఆడబోమని చెప్పింది వాళ్ళు (పాకిస్థాన్). ఐసీసీ షెడ్యూల్ ఇచ్చింది, ప్రభుత్వం న్యూట్రల్ వెన్యూ (కొలంబో) నిర్ణయించింది. మా వరకు అయితే కొలంబోకి ఫ్లైట్ టిక...