భారతదేశం, ఫిబ్రవరి 5 -- మేడారం సమ్మక్క - సారక్క జాతర ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో దేవదాయశాఖ హుండీ లెక్కింపు ప్రక్రియను చేపట్టింది. ఇందుకోసం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేసింది. ఈ లెక్కింపును రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం ప్రారంభించారు.

దేవాదాయ శాఖ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థ కార్యకర్తలు మొత్తం 500 మంది ఆధ్వర్యంలో లెక్కింపు చేపడుతున్నారు. మొత్తం 788 హుండీలలోని కానుకలు లెక్కిస్తారు. గత జాతరలో 540 హుండీలు పెట్టగా 13.25 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ధపా అంతకన్నా ఎక్కువగా వస్తుందని అంచనా వేస్తున్నారు. లెక్కింపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సుమారు 10 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని దేవదాయ అధికారులు తెలిపారు.

సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు వచ్చే భక్తుల సంఖ్య నిత్యం పెరుగుతూ వస్తోంది. ప్రత...